Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో షో ఏపీ సర్కారు అనుమతి : నెలాఖరు నాటికి శుభం కార్డు : చిరంజీవి

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (16:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు సమ్మతించిందని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. అలాగే, అన్ని సమస్యలకు ఈ నెలాఖరులోగా శుభం కార్డు పడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యూంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో తెలుగు హీరోలు చిరంజీవి, మహేషఅ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ తదితరులు సమావేశమయ్యారు. ఆ త ర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు తమను ఆహ్వానించినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు పరిశ్రమ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. సీఎం నిర్ణయం మమ్మల్ని అందర్నీ సంతోషపరిచిందన్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై నెలాఖరులోగా శుభంకార్డు పడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా, చిన్న సినిమాలపై సీఎం జగన్ దృష్టిసారించారని చెప్పారు. ఈ సినిమాలు కూడా విజయవంతం కావాలన్న ఉద్దేశ్యంతో ఆయన మా అందరి కోరికను మన్నించి ఐదో ఆటకు అనుమతించారు. దీని వల్ల చిన్న నిర్మాతలకు, ఇతరులకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది అని చెప్పారు. అలాగ, విశాఖపట్టణంలో తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందాలని ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చెప్పారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments