Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో షో ఏపీ సర్కారు అనుమతి : నెలాఖరు నాటికి శుభం కార్డు : చిరంజీవి

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (16:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు సమ్మతించిందని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. అలాగే, అన్ని సమస్యలకు ఈ నెలాఖరులోగా శుభం కార్డు పడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యూంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో తెలుగు హీరోలు చిరంజీవి, మహేషఅ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ తదితరులు సమావేశమయ్యారు. ఆ త ర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు తమను ఆహ్వానించినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు పరిశ్రమ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. సీఎం నిర్ణయం మమ్మల్ని అందర్నీ సంతోషపరిచిందన్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై నెలాఖరులోగా శుభంకార్డు పడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా, చిన్న సినిమాలపై సీఎం జగన్ దృష్టిసారించారని చెప్పారు. ఈ సినిమాలు కూడా విజయవంతం కావాలన్న ఉద్దేశ్యంతో ఆయన మా అందరి కోరికను మన్నించి ఐదో ఆటకు అనుమతించారు. దీని వల్ల చిన్న నిర్మాతలకు, ఇతరులకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది అని చెప్పారు. అలాగ, విశాఖపట్టణంలో తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందాలని ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చెప్పారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments