Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావను పెళ్ళి చేసుకుంది, ప్రియుడితో సహజీవనం చేసింది, ఆ తర్వాత?

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (18:51 IST)
అక్రమ సంబంధాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి. అలాంటి ఘటనే విజయనగరం పట్టణంలో జరిగింది. అనారోగ్యంతో అక్క చనిపోతే బావను పెళ్ళి చేసుకున్న మరదలు.. ప్రేమను వదులుకోలేక ప్రియుడితోను సహజీవనం చేసింది. చివరకు ప్రియుడు మోసం చేశాడని తెలియడంతో తనువు  చాలించుకుంది. 
 
విజయనగరం పట్టణానికి చెందిన ఒక మహిళకు విశాఖకు చెందిన వ్యక్తితో సంవత్సరం క్రితం వివాహమైంది. అయితే ఆమె ప్రసవ సమయంలో నెల రోజుల క్రితం అపస్మారకస్థితిలోకి వెళ్ళి చనిపోయింది. అయితే ఆమె భర్త ఒంటరివాడు అయిపోతాడని భావించిన తల్లిదండ్రులు రెండో కుమార్తెను ఇచ్చి 15 రోజుల క్రితం వివాహం చేశారు.
 
తల్లిదండ్రుల మాట జవదాటని ఆ యువతి బావను పెళ్ళి చేసుకుంది. అయితే అంతకుముందే రెండునెలల క్రితం నుంచి అదే ప్రాంతానికి చెందిన రాజేంద్రనాథ్‌తో యువతి పీకల్లోతు ప్రేమలో ఉంది. అతనితో శారీరకంగా బాగా దగ్గరైంది. రాజేంద్రనాథ్ ఆటో డ్రైవర్‌గా ఉండేవాడు.
 
వివాహమైన తరువాత కూడా ప్రియుడిని వదిలి ఉండలేకపోయింది. తన భర్తతో ఐదురోజుల క్రితం గొడవపెట్టుకుని రాజేంద్రనాథ్‌తో వెళ్ళిపోయింది యువతి. రెండు రోజులుగా రాజేంద్రనాథ్‌లో మార్పు రావడం.. వేరొక యువతితో అతను సన్నిహితంగా ఉండటం గమనించింది యువతి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. నిన్న రాత్రి రాజేంద్రనాథ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు రాజేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments