Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడిని మందలించిన పాపానికి తండ్రి హత్య

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (14:29 IST)
చెడు వ్యసనాలకు అలవాటు పడిన కుమారుడిని మందలించిన పాపానికి తండ్రి హత్యకు గురైనాడు. మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న కన్న తండ్రినే కొడుకు కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఈ హృదయ విధారక ఘటన జిల్లా వాసులను తీవ్రంగా కలచి వేసింది. 
 
కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కోసిగి నాల్గవ వార్డులో అల్లమ్మ, వీరయ్య దంపతులు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. వీరి పెద్దకుమారుడు నరసింహులు చదువు మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మద్యంకు బానిస అయ్యాడు.
 
నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి ఆ మత్తులో తల్లిదండ్రులను వేధించేవాడు. కొడుకుకు బుద్ది చెప్పాలని తండ్రి వీరయ్య కొడుకు నరసింహులను పలుమార్లు మందలించాడు.
 
ఇలా తరచూ తండ్రి మందలిస్తుండడంతో మద్యం మత్తులో గొడ్డలితో తండ్రి గొంతుపై నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడును అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments