Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి పంచివ్వలేదని తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు...

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (19:20 IST)
కన్న కొడుకులకు ఆస్తి పంచితే తమను చూసుకోరనే ఉద్దేశంతో పంపకాన్ని వాయిదా వేసిన తల్లిదండ్రులను, దారుణంగా పెట్రోలు పోసి కాల్చాడు ఓ కొడుకు. వారి హాహాకారాలకు చుట్టుప్రక్కల వారు తరలివచ్చారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 
 
కణేకల్‌లోని రామ్‌నగర్ కానీలో కుటుంబంతోపాటు నివసిస్తున్న నారాయణరెడ్డి, నరసమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారికి వంశపార్యంపరంగా వస్తున్న ఒక ఎకరా భూమిని, సొంత ఇంటిని పంచి ఇవ్వలేదని కోపంతో ఉన్నారు. పంచిపెట్టమని వారిపై పదేపదే ఒత్తిడి తేసాగారు. అయితే ఆస్తి పంచితే వారిని బాగా చూసుకోరనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పంపకాన్ని వాయిదా వేస్తూవచ్చారు. 
 
ఈ తీరు నచ్చని చిన్న కొడుకు మధుసూదన్ రెడ్డి, తల్లిదండ్రులపై మరింత ఒత్తిడి చేశాడు. వారు ససేమిరా కాదనటంతో కోపానికి లోనయ్యాడు. ఆదివారం వారు ఒంటరిగా ఉండగా వారిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. తనతోపాటు తెచ్చిన పెట్రోలును వారిపై పోసి నిప్పంటించాడు. శరీరం కాలి వారు బాధతో అరుస్తుంటే చుట్టుప్రక్కల వారు పరుగున వచ్చారు. వెంటనే మంటలు ఆర్పి బాధితులను బళ్లారి ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. దాడికి దిగిన మధుసూదన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments