Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడిని వెంటాడి కబళించిన మృత్యువు...

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (17:40 IST)
యువకుడిని మృత్యువు వెంటాడి మరీ కబళించింది. ట్రక్కు నడుపుతూ వెళ్లిన అతడిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతనికి గాయాలయ్యాయి. 
 
చికిత్స పొంది రాత్రి సమయంలో ట్రక్కులోనే భోజనం చేస్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
మొదట జరిగిన ప్రమాదంలో గాయాలతో బయటపడగా.. రెండో సారి జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. 
 
కర్నూలు జిల్లా సున్నిపెంటకు చెందిన ఉమర్‌.. మంగళవారం మధ్యాహ్నం శ్రీశైలం నుంచి ట్రక్కు నడుపుకుంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం వస్తున్నాడు. పెద్దారవీడు సమీపంలోని అంకాలమ్మ గుడి మూలమలుపు వద్ద ట్రక్కును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ట్రక్కు ముందు భాగం దెబ్బ తింది. ఉమర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం స్థానిక ఆస్పత్రిలో ఉమర్ చికిత్స పొందాడు. ప్రమాదం జరిగిందని సమాచారం తెలుసుకున్న ట్రక్కు యజమాని మల్లికార్జున సున్నిపెంట నుంచి వచ్చారు. ఆయన, ఉమర్‌ కలిసి మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఘటనా స్థలంలోనే ట్రక్కులో భోజనం చేస్తున్నారు.
 
ఈ సమయంలో మార్కాపురం నుంచి దోర్నాల వైపు వెళ్తున్న టిప్పర్‌ వేగంగా వచ్చి ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఉమర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments