Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాలమూరులో సామూహిక అత్యాచారం - బాధితురాలు ఆత్మహత్య

పాలమూరులో సామూహిక అత్యాచారం - బాధితురాలు ఆత్మహత్య
, బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (18:33 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు (మహబూబ్ నగర్) జిల్లాలో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ జిల్లాలోని ఆలేరు గ్రామానికి చెందిన 23 యేళ్ల యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉండగా, నలుగురు యువకులు ఇంట్లో చొరబడి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ అవమానం భరించలేక ఆ యువతి తనను గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు యువకుల పేర్లతో సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 18వ తేదీన పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది. 
 
దీన్ని గమనించిన ఆ యువతి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వల్ల గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయనగరంలో దొంగల చేతివాటం : 5 కేజీల బంగారం చోరీ