Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్గదర్శకుడు జాతిపిత మహాత్మా గాంధీ : చంద్రబాబు

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (10:20 IST)
జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్థంతిని సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. రాజ్‌ఘాట్‌కు నివాళులు అర్పించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు, జాతీయ పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు కూడా నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. 
 
అలాగే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర్ రావులు కూడా నివాళులు అర్పించారు. కాగా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పిస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజును అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నాం. ఈ సందర్భంగా దేశ ప్రజల సంక్షేమానికి, సమైక్యతకు, శాంతియుత జీవనం కోసం కృషి చేస్తూ ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ గౌరవవందనం సమర్పిస్తున్నాను. 
 
దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టటమే కాకుండా, మనిషిని మహాపురుషునిగా చేసే సద్గుణాలను సూచించిన మార్గదర్శకుడు గాంధీజీ. "మన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహించడమే దేశసేవ' అన్న గాంధీసూక్తి నాకు ఆదర్శం. మహాత్ముని వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments