Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతు ఉద్యమం 700వ రోజు... మ‌హా పాద‌యాత్ర 16వ రోజు!

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (12:49 IST)
అమరావతినే ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ 16వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ్టి యాత్ర విక్కిరాలపేట నుంచి కందుకూరు వరకు సాగుతోంది.  అమరావతి రైతుల ఉద్యమం 700వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో యాత్రలో ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సర్వమత ప్రార్థనలు, అమరావతి అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు.
 
 
వీటితో పాటు అమరావతి లక్ష్య సాధన ప్రతిజ్ఞ, ఉదయం 10.గంటలకు మహిళల ప్రత్యేక మాలధారణ, ఎస్సీ మైనారిటీల అమరావతి సంకల్పం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30వరకు అమరావతి ఉద్యమ గీతాలాపన, మధ్యాహ్నం 2.30గంటలకు ఉద్యమ కాలాల్లో ముఖ్యమైన ఘాట్టాలపై వ్యాఖ్యానం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30వరకు పాదయాత్ర మార్గమధ్యలో కళ్లకు గంతలతో నిరసన, సాయంత్రం 6నుంచి 7వరకు అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నారు.

 
అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 15న తిరుపతిలో ముగియనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments