Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. మూడు నెలల్లోనే తిరిగి రాని లోకాలకు..?

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (16:19 IST)
తల్లిదండ్రులు ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతుల జీవితంలో విధి వినాశకంగా మారింది. ఆనందంగా సాగాల్సిన వారిజీవితం అర్ధాంతరంగా ముగిసింది. పెళ్లైన మూడు నెలలకు గుండె జబ్బుతో భర్త చనిపోగా… మనోవేదనతో భార్య జనవరి7న గురువారం కన్నుమూసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. రాపూరు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన శిరీష (30)నగరంలోని జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తోంది. ఆమెకు గూడురు అయ్యవారి పాళేనికి చెందిన జగదీష్ తో పరిచయం అయ్యింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు.పెద్దలను ఎదిరించి ప్రేమికులు ఇద్దరూగత సంవత్సరం అక్టోబర్ 29న ప్రేమ వివాహం చేసుకున్నారు.
 
సంతోషంగా సాగిపోతున్నవారి జీవితంలో పెళ్లైన రెండు నెలలకే విషాదం చోటు చేసుకుంది. డిసెంబర్‌లో భర్త జగదీష్ గుండె పోటుతో మరణించాడు. దీంతో శిరీష మనోవేదనకు గురైంది. ప్రేమించిన భర్త దూరం అవటం, కుటుంబసభ్యులు దగ్గరకు రానివ్వకపోవటంతో మానసికంగా కుంగి పోయింది. స్నేహితులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
 
ఒంటిరిగా ఉంటున్న ఆమె జనవరి 6వ తేదీన తనకు తోడుగా స్నేహితురాలు రమాదేవిని ఇంట్లో చేర్చుకుంది. 7వ తేదీ సాయంత్రం కళ్లు తిరుగుతున్నాయని శిరీష స్నేహితురాలికి చెప్పింది. వెంటనే ఆమె ఆస్పత్రికి తీసుకు వెళ్లింది. వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 174 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమించి వివాహం చేసుకున్న కొద్దిరోజులకే భార్యాభర్తలు మరణించటం ఇరు కటుంబాల్లో విషాదం నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments