Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి మోజులో పడి మహిళ ఏం చేసిందో చూడండి

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (09:05 IST)
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని వీవర్స్‌ కాలనీలో ఉంటున్న ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వీవర్స్‌ కాలనీకి చెందిన నాగభూషణం (అలియాస్‌ చిట్టి) డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అతడికి నల్లమాడ మండలం మీసాలవాండ్లపల్లికి చెందిన ఈశ్వరమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఈశ్వరమ్మకు.. నాగభూష ణం వరుసకు మేనమామ అవుతాడు.

ప్రియుడి మోజులో పడి ఈశ్వరమ్మ.. భర్తను హతమార్చినట్లు తెలిసింది. జనవరి 1న భర్తను చంపి, 2న పిల్లవంక కాలనీ సమీపంలో ప్రియుడు, మరో ముగ్గురు సాయంతో శవాన్ని పూడ్చిపెట్టినట్లు తెలిసింది. ఆ తర్వాత తన భర్త ఎక్కడికో వెళ్లిపోయాడని చుట్టుపక్కల వారితో చెప్పి, పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

రెండు రోజుల క్రితం ముదిగుబ్బలో గుర్తుతెలియని శవం వెలుగు చూడటంతో గుర్తించాలని ఈమెను పిలిపించారు. పోలీసులకు అనుమానం వచ్చి లోతు గా విచారించగా, భర్త నాగభూషణంను తానే హతమార్చినట్లు, శవా న్ని పూడ్చడానికి ప్రియుడి సహాయం తీసుకున్నట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

పోలీసులు మంగళవారం శవాన్ని పూడ్చిన చోటుకు తీసుకె ళ్లారు. మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం ని మిత్తం తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments