Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి కంటే నరేంద్ర మోడీ గొప్పవాడా : సోనియా గాంధీ

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (15:32 IST)
కాంగ్రెస్ మాజీ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గంలో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీలు కూడా పాల్గొన్నారు. కాగా, నామినేషన్‌కు ముందు సోనియా తన కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఓటమి ఎరుగని నేతగా తాము భావించడంలేదన్నారు. 2004 ఎన్నికల సందర్భంగా వాజ్‌పేయి గురించి కూడా ఇలాగే అనుకున్నారని, కానీ, తాము ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించామని గుర్తుచేశారు. ఇప్పుడు మోడీ అంతకంటే గొప్పవాడేమీ కాదని, ఈ ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. 
 
ఆ తర్వాత రాహుల్ స్పందిస్తూ, తమకు తిరుగులేదని, ప్రజల కంటే తామే గొప్పవాళ్లమని అహకరించిన వాళ్లు భారతదేశ చరిత్రలో కొందరు ఉన్నారని, నరేంద్ర మోడీ గత ఐదేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఆయన ఎంతటి అజేయుడో ఎన్నికల తర్వాత తేలిపోతుందని రాహుల్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments