రోజాకు నిద్ర లేకుండా చేస్తున్న నేతలు.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (21:29 IST)
అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. నగరి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం ఇది. సొంత పార్టీ నేతలపై రోజా ఆగ్రహం సంచలనంగా మారింది. వైసిపిలో వర్గపోరు ఆ రేంజ్‌లో ఉందంటున్నారు విశ్లేషకులు.
 
చిత్తూరు జిల్లా మున్సిపల్ ఎన్నికల సంధర్భంగా నగరి వైసిపిలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. వైసిపి నేత కె.జె.కుమార్ రెబల్ అభ్యర్థులను బరిలోకి దింపారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రోజా పోలింగ్ కేంద్రం బయటే అధిష్టానానికి లేఖ రాశారు. 
 
రెబల్స్ పైన చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రిని కోరారు రోజా. నిజానికి వైసిపిలో వర్గపోరు కొత్తమాటేం కాదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు ప్రయత్నించారని రోజా ఆరోపణలు చేశారు.
 
రాజకీయంగా తనను అణగదొక్కడానికి ఇదంతా చేస్తున్నారని.. తనను ఒంటరి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న భావన ఆమెలో ఎప్పటినుంచో ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పేచీ పెట్టుకున్నారు రోజా.
 
తరువాత డిప్యూటీ సిఎం నారాయణస్వామితో ఇదే పరిస్థితి. అవకాశం ఉన్నప్పుడల్లా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఇక స్థానిక ఎన్నికల సంధర్భంలో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఈ గొడవకు జరుగుతుండగానే కె.జె.కుమార్ షష్టిపూర్తి వేడుకలకు మంత్రి పెద్దిరెడ్డి, నారాయణస్వామిలు హాజరవ్వడాన్ని రోజా అస్సలు జీర్ణించుకోలేకపోయారు.
 
ప్రస్తుతం నగరిలో వైసిపిని ఓడించేందుకు స్వయంగా కె.జె. కుమార్, కె.జె. శాంతిలు రెబల్స్ అభ్యర్థులను బరిలోకి దించడంతో రోజా ఏ మాత్రం జీర్ణించుకులేకపోయారు. పంచాయతీని ప్రస్తుతం ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది. ఇది కాస్త రోజాకు నిద్రలేకుండా చేస్తోందట. ఎల్లుండి ఫలితాలు ఎలా వస్తాయోనన్న ఆందోళనలో రోజా ఉన్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments