Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌కు పలువురు నేతలు నివాళి

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (12:29 IST)
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ (63) బుధవారం సాయంత్రం చెన్నైలో కరోనావైరస్ కారణంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతికి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అంబేద్కర్ ఆడిటోరియంలో బల్లి దుర్గాప్రసాద్‌కు సంతాప సభ ఏర్పాటు చేశారు.
 
ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వేమి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సత్యవతి, గోరంట్ల మాధవ్, పోచ బ్రహ్మానంద రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయులు, అయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్ర శేఖర్, తలారి రంగయ్య అలాగే ఏపీ భవన్ ఉన్నతాధికారులు, అభయ త్రిపాటి, భావన సక్సేనా, రమణారెడ్డిలు దుర్గాప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
 
బల్లి దుర్గాప్రసాద్‌తో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని 28 ఏళ్లకే రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా గెలిచారని ప్రతిసారి తన ఆశీస్సులు తీసుకునేవారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఆయన మరణం కుటుంబానికే కాదు వ్యక్తిగతంగా తనకు కూడా లోటని ఆయన అన్నారు. అలాగే బల్లి దుర్గాప్రసాద్ గారు ఏదైనా భోళాగా మాట్లాడే మనిషి, నిరంతరం పేద ప్రజల కష్టాలను తీర్చడం కోసం పరితపించేవారని తెలిపారు.
 
ఆయన అకాల మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటు అని తెలిపారు. ఇటీవల స్వల్ప అనారోగ్యం కారణంగా దుర్గాప్రసాద్ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దాంతో మూడు వారాల పాటు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయినా దుర్గాప్రసాద్ గుండెపోటుతో మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments