Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప నడిబొడ్డున న్యాయవాది అనుమానాస్పద మృతి... హత్యేనా...?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (12:06 IST)
తెలుగు రాష్ట్రాల్లో న్యాయవాదులు వరుసగా హత్యకు గురవుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వామనరావు అనే న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇపుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నడిబొడ్డున ఓ న్యాయవాది అనుమానాస్పదంగా మృతి చెందడం ఇపుడు కలకలం రేపుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే రాజారెడ్డి వీధికి చెందిన‌ న్యాయవాది పి.సుబ్రమణ్యం గ‌త‌ రాత్రి తన ఇంటి నుంచి పాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌కు ఫోన్ చేయ‌గా ఆయ‌న సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి ఉంద‌ని వారికి తెలిసింది.
 
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు అ సుబ్రమణ్యం పాత అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లి ఆయ‌న కోసం వెతికారు. అక్కడే సుబ్ర‌హ్మ‌ణ్యం చెప్పులు ఉన్నాయి కానీ, మ‌నిషి లేక‌పోవ‌డంతో అపార్ట్‌మెంట్ ప‌రిస‌రాల్లో గాలించారు.
 
అపార్ట్‌మెంట్‌ కింద సుబ్రమణ్యం మృత‌దేహం రక్తపు మడుగులో పడి ఉండ‌డాన్ని చూసిన పోలీసులు ఆయ‌న‌ మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఆయ‌న‌ను ఎవ‌రైనా హత్యా చేశారా? లేక ఆయ‌న‌ ఆత్మహత్యకు పాల్పడ్డా‌? అన్న విష‌యంపై విచార‌ణ జ‌రుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments