Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప నడిబొడ్డున న్యాయవాది అనుమానాస్పద మృతి... హత్యేనా...?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (12:06 IST)
తెలుగు రాష్ట్రాల్లో న్యాయవాదులు వరుసగా హత్యకు గురవుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వామనరావు అనే న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇపుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నడిబొడ్డున ఓ న్యాయవాది అనుమానాస్పదంగా మృతి చెందడం ఇపుడు కలకలం రేపుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే రాజారెడ్డి వీధికి చెందిన‌ న్యాయవాది పి.సుబ్రమణ్యం గ‌త‌ రాత్రి తన ఇంటి నుంచి పాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌కు ఫోన్ చేయ‌గా ఆయ‌న సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి ఉంద‌ని వారికి తెలిసింది.
 
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు అ సుబ్రమణ్యం పాత అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లి ఆయ‌న కోసం వెతికారు. అక్కడే సుబ్ర‌హ్మ‌ణ్యం చెప్పులు ఉన్నాయి కానీ, మ‌నిషి లేక‌పోవ‌డంతో అపార్ట్‌మెంట్ ప‌రిస‌రాల్లో గాలించారు.
 
అపార్ట్‌మెంట్‌ కింద సుబ్రమణ్యం మృత‌దేహం రక్తపు మడుగులో పడి ఉండ‌డాన్ని చూసిన పోలీసులు ఆయ‌న‌ మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఆయ‌న‌ను ఎవ‌రైనా హత్యా చేశారా? లేక ఆయ‌న‌ ఆత్మహత్యకు పాల్పడ్డా‌? అన్న విష‌యంపై విచార‌ణ జ‌రుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments