అల్లుడు భాగోతం అత్తే చెప్పాలంటున్న లక్ష్మీపార్వతి

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (15:20 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైకాపా మహిళా నేత లక్ష్మీపార్వతి తనదైనశైలిలో సెటైర్లు వేశారు. టీడీపీ నేతల ఇళ్లు, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టిన అంశంపై ఆమె స్పందించారు. 
 
"అల్లుడి భాగోతం అత్తే చెప్పాలి మరి... ఎన్టీఆర్ ను అమాయకుడ్ని చేసి మోసగించాడు. ఆ దుష్టుడి విధానాలు ఇప్పటికీ మారలేదు. అబద్ధానికి, అతడికి అవినాభావ సంబంధం ఉంది. కొడుకు అసమర్థుడు అనుకుంటే అతడికి అవినీతి, అబద్ధాలతో పాటు తాజాగా తిట్టడం కూడా నేర్పించాడు. అదీ చంద్రబాబు సంస్కారం" అంటూ ధ్వజమెత్తారు.
 
అంతేకాదు, చంద్రబాబు దీక్ష శిబిరంపై సెటైర్ వేశారు. "ఇవాళ అల్లుడి నిరాహార దీక్ష శిబిరం పక్కనుంచే వచ్చాను. అక్కడంతా బిర్యానీ పొట్లాలు, డబ్బుల గురించిన మాటలే వినిపించాయి. మధ్యలో ఓ తెర కూడా కట్టారు. బహుశా తినడం ఎవరూ చూడకూడదనేమో!" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. కాగా, ప్రస్తుతం లక్ష్మీపార్వతి తెలుగు అకాడెమీకి అధ్యక్షురాలిగా ఉన్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments