Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పత్రికల విలేకరుల వీపులు వాయగొడతాం : కర్నూలు నగర మేయర్

Webdunia
మంగళవారం, 31 మే 2022 (10:41 IST)
తమ పార్టీకి చెందిన మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర బహిరంగ సభకు జనాలు లేక వెలవెలబోయాయంటూ కొన్ని పత్రికలు వార్తలను ప్రచురించాయని, ఆ పత్రికలకు చెందిన విలేకరుల వీపులు వాయగొడతామంటూ కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య హెచ్చరికలు జారీచేశారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు కర్నూలులో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
 
వైకాపా మంత్రులు ఇటీవల సామాజిక న్యాయభేరీ పేరుతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్రను చేపట్టారు. ఈ బస్సుయాత్ర కర్నూలుకు వచ్చినపుడు జనాలు కనిపించలేదు. దీన్ని కొన్ని పత్రికలు ఫోటోలు తీసి వార్తల రూపంలో ప్రదర్శించాయి. 
 
దీనిపై కర్నూలు మేయర్ బీవై రామయ్య స్పందిస్తూ, బస్సు యాత్ర కర్నూలుకు వచ్చినపుడు మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉందని, దీంతో ప్రజలు నీడ చాటుకు వెళితే సభకు జనాలు రాలేదంటూ కొన్ని పత్రికలు ప్రచారం చేశాయని ఆయన మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాస్తే వీపులు వాయగొడతామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments