Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (13:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడుని కర్నూలు పట్టణ పరిధిలోని వెంకటరమణ కాలనీకి చెందిన రాఘవరెడ్డిగా గుర్తించారు. ఈయన తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా పదోన్నతి రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 
 
కాగా, మృతుడు కర్నూలు జిల్లాలోలని ఈ-కాప్ విభాగంలో విధులు నిర్వహించే రాఘవరెడ్డిగా గుర్తించారు. ఈయన వెంకటరమణ కాలనీలోని అక్షయ కాలనీలో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన తన ఇంట్లో పురుగుల మందు తాగి బయటకు వచ్చి లిఫ్టు వద్ద పడిపోయివున్నాడు. దీన్ని గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, ఆయన్ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు వెల్లడించారు. 
 
ఈయన అనంతపురం జిల్లా నల్లమాడ మండలం నల్ల సింగాయగారి పల్లెకు చెందిన రాఘవరెడ్డి 1991 బ్యాచ్‌కు చెందిన ఎస్.ఐ. వివిధ కారణాల రీత్యా ఆయన పదోన్నతులు పొందలేకపోయారు. ప్రస్తుతం ఈ-కాప్ విభాగంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments