Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరిక తీర్చలేదని మైనర్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (17:14 IST)
మైనర్ బాలికపై ఓ కామాంధుడు అమానుషంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చలేదని.. ఓ కామాంధుడు బాలికకు నిప్పంటించాడు. ఈ దుర్ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు, కౌతాలం మండలం బదినేహల్‌కి చెందిన మౌలాలీ, ఓ మైనర్ బాలికను ఏడాది నుంచి లైంగిక వేధింపులకు గురిచేశాడు. 
 
భార్యతో పాటు ముగ్గురు పిల్లలు వున్నా బాలికపై కన్నేశాడు. తన కోరిక తీర్చమని వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు మౌలాలీని హెచ్చరించారు. అయినా కామాంధుడు బుద్ధి మార్చుకోలేదు. దీంతో బాలిక తన ఇంట్లో ఒంటరిగా వున్నట్లు గమనించిన మౌలాలీ బాలికను బలవంతం పెట్టాడు. 
 
అందుకు బాలిక ప్రతిఘటించడంతో అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను బాలికపై నిప్పంటించి పారిపోయాడు. బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం