Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీచైతన్య కాలేజీ విద్యార్థిని బలవన్మరణం

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (06:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా పునాదిపాడులోని శ్రీచైతన్య కాలేజీ క్యాంపస్‌లో ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని అనంతపురం జిల్లాకు చెందిన లాస్యశ్రీగా గుర్తించారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురానికి చెందిన దాసరి లాస్యశ్రీ (16) అనే యువతి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఆమె రాత్రి స్నేహితులతో కలిసి భోజనం చేసిన తర్వాత తన గదికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
దీన్ని గమనించిన సహచర విద్యార్థులు హాస్టల్ వార్డన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వార్డెన్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు... లాస్యశ్రీని పోరంకిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 
 
ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గారావు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments