Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌జ‌ల‌పై, డాక్ట‌ర్ల‌పై ఆమంచి కృష్ణమోహన్ క‌క్ష సాధింపు చ‌ర్య‌లు

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (08:28 IST)
2019 సాధారణ ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ అతని కుటుంబం చేసిన అరాచకాల కారణంగానే చీరాల ప్రజలు ఆమంచిని పక్కన పెట్టారని ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు.

అయినా ఏమాత్రం పద్ధతి మార్చుకోని ఆమంచి అధికార పార్టీని అడ్డుపెట్టుకొని ప్రజలపై, వ్యాపారస్తులపై, డాక్టర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం చీరాల కొత్తపేట రోడ్ లోని రామానాయుడు పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల మోహన్ కుమార్ ధర్మ, సేవా సంస్థ అధ్యక్షులు కోటి ఆనంద్, బహుజన ప్రజాస్వామ్య వేదిక నాయకులు దుడ్డు విజయ్ సుందర్, బీసీ యువజన సంఘం నాయకులు కొల్లిపర వెంకటేష్, వైసిపి యువ నాయకులు గోసాల అశోక్, వై.ప్రసాదు, విశ్రాంత ఉపాధ్యాయులు ఎస్‌జె చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గంలో కరో నా పరిస్థితులను అడ్డంపెట్టుకుని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆమంచిని ప్ర‌శ్నిస్తున్నందుకు, వ్యాపారస్తులపై, డాక్టర్లపై తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments