Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో విషాదం : గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసెలు దగ్దం

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (16:28 IST)
కృష్ణా జిల్లాలోని తోటవల్లూరు మండలం, గరికపర్రు అనే గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అనేక పూరి గుడిసెలు కాలిపోయాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. 
 
స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల మేరకు... ఈ గ్రామానికి చెందిన మేకల వీరమ్మ అనే మహిళకు చెందిన పూరిగుడిసెలో గ్యాస్ పొయ్యిపై పాలుబెట్టి బయట పనులు చేసుకుంటుంది. ఆ సమయంలో గ్యాస్ లీకై మంటలు గుడిసెకు అంటున్నాయి. దీంతో ఆమె భయపడి తన బిడ్డను తీసుకుని బయటకు పరుగెత్తింది. 
 
ఇంతలోనే గ్యాస్ బండ పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఆ గుడిసెకు పక్కనే ఉన్న అనేక గుడిసెలకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ గుడిసెల్లో ఉన్న వారంతా ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ మంటలను ఆర్పేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింద. 
 
ఫలితంగా అనే గుడిసెలు కాలిపోయాయి. నాలుగు కుటుంబాలకు చెందిన ప్రజలు కేవలం కట్టుబట్టలతో మిగిలారు. ఈ అగ్నిప్రమాదం వల్ల రూ.5 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించివుడొచ్చని అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments