Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్ణీత కాల వ్యవధిలోనే లబ్ధిదారులకు అందాలి : జాయింట్ కలెక్టర్

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (16:13 IST)
రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని నిర్ణీత కాలవ్యవధిలోనే లబ్ధిదారులకు అందించాలని జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత అన్నారు. మంగళవారం కృష్ణా జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత పామర్రు తాహశీల్దారు సురేష్ బాబుతో కలసి పామర్రు మండలం పెదమద్దాలి, అడ్డాడ, కోమరవోలు గ్రామాల్లోని సచివాలయాలను సందర్శించారు. 
 
ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి సూచనలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను పూర్తి స్థాయిలో అర్ధం చేసుకుని నిర్ణీత కాలవ్యవధిలోనే లబ్ధిదారులకు అందించాలన్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు సమయపాలన పాటిస్తూ అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. 
 
ఈ నెల 25వ తేదీన అర్హులైన లబ్ధిదారులకు అందించే ఇళ్లస్థల పట్టాల పంపిణీ ప్రక్రియకు సంభందించిన వివరాలను అడిగి తెలుసుకుంన్నారు. అదేవిధంగా జగనన్న చేయూత, జగనన్న తోడు, ఆసరా, నాడు - నేడు పనులపురోగతి పై శాఖల వారి పర్సన్ అసిస్టెంట్లు నిర్వహిస్తున్న రిజిస్ట్రలను పరిశీలించారు. 
 
రైస్ కార్డ్స్ మరియు ప్రభుత్వం అందించే పథకాలకు సంభందించి నిర్ణీత వ్యవధిలోనే దరఖాస్తులు చేసిన ప్రజలుకు సమాదానాలు తెలియజేస్తూ జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ కె.మాధవి లత ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వెంట తహసిల్దార్ సురేష్ బాబు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది వున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments