Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత... త్వరలో జేసీ దివాకర్ రెడ్డి కూడా...

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (16:54 IST)
అరకు మాజీ ఎంపీ, జనజాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత పార్టీ మారిపోయారు. ఆమె తన సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయ కండుపా కప్పుకున్నారు. పైగా, తాను స్థాపించిన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు. 
 
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆహ్వానం మేరకు ఆమె బీజేపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసిన గీత ఎంపీగా గెలుపొందారు. అనంతరం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆమె... సొంతంగా జనజాగృతి అనే పార్టీని గత ఏడాది స్థాపించారు.
 
ఈ సందర్భంగా అమిత్ షా, రాంమాధవ్‌లకు ట్విట్టర్ ద్వారా గీత ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ వేదికగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. అమిత్ షా నాయకత్వంలో పార్టీ ఉన్నతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని అన్నారు.
 
మరోవైపు, టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై ఇప్పటికే విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అదేసమయంలో ఈ ప్రచారంపై జేసీ దివాకర్ రెడ్డి కూడా స్పందించడం లేదు. ఖండించడం కూడా లేదు. ఫలితంగా ఆయన బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments