Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో చేరనున్న వైకాపా తిరుగుబాటు నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (09:51 IST)
నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా తిరుగుబాటు నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈయన నెల్లూరు రూరల్ వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీ అధినేత చంద్రబాబు చెంతకు చేరుతున్నానని, అందువల్ల ఈ కార్యక్రమానికి మద్దతుదారులు భారీగా తరలివచ్చి తనను ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను నగరమంతా ఏర్పాటు చేశారు. ఉదయం నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించి.. అటు నుంచి తాడేపల్లికి తరలివెళ్లేలా ఏర్పాట్లుచేశారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చంద్రబాబునాయుడు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. 
 
ఈ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో వాహనాల ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన గిరిధర్‌రెడ్డి.. ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు కొంతకాలంగా వైకాపాకు దూరంగా ఉన్నారు. అలాగే, తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైకాపా అభ్యర్థికి వ్యతిరేకంగాను, టీడీపీ అభ్యర్థి అనురాధకు అనుకూలంగా ఓటు వేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments