Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి కేసులో ఎన్.ఐ.ఏ కోర్టులో సీఎం జగన్ పీఏ

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (17:02 IST)
తనపై కోడి కత్తితో దాడి చేసిన కేసులో బాధితుడుగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. గత 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్‍‌పై కోడికత్తితో దాడి చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ కేసు విచారణలో భాగంగా, కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరిన విషయం తెల్సిందే. ఆయన వినతికి సానుకూలంగా కోర్టు సానుకూలంగా స్పందించడంతో ఆయన తరపున పీఏ కె.నాగేశ్వర రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.
 
 
 
కాగా, గత 2018 అక్టోబరు నెలలో విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఎయిర్‌పోర్టులోని ఒక రెస్టారెంట్‌లో పని చేస్తున్న శ్రీనివాస్ ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ కోడిగత్తి గాయంతోనే జగన్ నేరుగా హైదరాబాద్ నగరానికి చేరుకుని ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆయన వ్యక్తిగత పీఏ కోర్టుకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments