Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌పై చర్యలకు డిమాండ్ చేస్తే 'సొము'కెందుకు కోపం? అచ్చెన్న

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (12:25 IST)
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై కేంద్రం చర్యలు తీసుకోవాలంటే ఎందుకంత కోపం, అసహనం ప్రదర్శించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
 
రాష్ట్రంలో దారుణాలు, నేరాలు, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలు ఆందోళన వ్యక్తం చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. రాష్ట్రాల్లో పాలన గాడి తప్పినప్పుడు, అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు ఆర్టికల్‌ 355 ప్రకారం కలగజేసుకొనే అధికారం కేంద్రానికి ఉందన్న విషయాన్ని వీర్రాజు తెలుసుకోవాలని అచ్చెన్న అన్నారు. 'వైకాపా మూకల విధ్వంసంపై పోరాడాల్సిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.. అధికార పార్టీని, ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడం దారుణం' అని అచ్చెన్నాయుడు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments