పోస్టింగ్ లేకుండానే పదవీ విరమణ చేస్తున్న 400 మంది ఉపాధ్యాయులు...

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (11:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 1998 డీఎస్సీ పరీక్షల్లో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల్లో 400 మంది ఎలాంటి ఉపాధ్యాయ పోస్టింగులు లేకుండానే పదవీ విరమణ చేయాల్సిన విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వీరంతా ఈ నెలాఖరు నాటికి నెల వేతనం అందుకోకుండానే ఇంటికి వెళ్ళనున్నారు. 
 
వేసవి సెలవు తర్వాత ఏపీలో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే, పోస్టింగ్‌ ఇవ్వని కారణంగా నెల జీతం తీసుకోకుండానే డీఎస్సీ-98 అభ్యర్థులు 400 మంది పదవీ విరమణ చేసే పరిస్థితి ఏర్పడింది. రెగ్యులర్‌ ఉపాధ్యాయుల బదిలీల కారణంగా గత విద్యా సంవత్సరంలో వీరు పొందిన పోస్టింగ్‌లు పోయాయి. దీంతో పాఠశాలలు పునః ప్రారంభమైన జూన్‌ 12న అభ్యర్థులు విధుల్లో చేరలేకపోయారు. 
 
అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో వీరికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఇటీవల కమిషనర్‌ ఆదేశించారు. కానీ అభ్యర్థులను ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియని విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వలేదు. గత విద్యాసంవత్సరం ఏప్రిల్‌ 12వ తేదీన పోస్టింగ్‌లు ఇచ్చిన ప్రభుత్వం ఇంత వరకు జీతం సైతం ఇవ్వలేదు. 
 
వీరిలో 16 మంది అదే నెలలో రిటైర్‌ అయిపోగా.. ఒప్పందం ముగిసి ఇంటి వద్ద ఉంటున్న 256 మంది మే నెలలో పదవీ విరమణ చేశారు. అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వడంలో విద్యాశాఖ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుండటంతో నెలాఖరుకు మరో 400 మంది నెల జీతం తీసుకోకుండానే రిటైర్‌ అయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments