Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెస్టారెంట్‌లో గ్యాస్ పేలుడు - 31 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (10:52 IST)
డ్రాగన్ కంట్రీ చైనాలో భారీ విపత్తు జరిగింది. ఈ దేశంలోని ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ పేలుడు ఘటన సంభవించింది. దీంతో 31 మంది మృత్యువాతపడ్డారు. స్థానిక మీడియా కథనం మేరకు.. రెస్టారెంట్‌లో జరిగిన గ్యాస్ పేలుడు వల్ల 31 మంది చనిపోగా మరికొందరు గాయపడినట్టు పేర్కొంది. 
 
ప్రస్తుతం చైనా ప్రజలు డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌ను జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వరుసగా మూడు రోజులు సెలవు దినాలు రావడంతో బంధు మిత్రులతో సరదాగా గడుపుతున్నారు. పండుగ కోసం అంతా గుమికూడివున్న సమయంలో యించువాన్ నగరంలోని ప్యూయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్‌లో బుధవారం రాత్రి ఉన్నట్టుండి భారీ శబ్దంతో ఈ పేలుడు సంభవించింది. 
 
రెస్టారెంట్‍‌లోని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఒకటి పేలిపోవడంతో 31 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది, ఫైరింజన్లతో అక్కడకు వచ్చి మంటలను ఆర్పివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments