ఆ రాష్ట్రంలో 500 మద్యం దుకాణాల మూసివేత!

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (10:28 IST)
పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో 500 మద్యం దుకాణాలను మూసివేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ రిటైలర్ టాస్మాక్ బుధవారం అధికారిక ప్రకటన విడుదలచేసింది. తొలి విడతలో పాఠశాలలు, దేవాలయాల సమీపంలో ఉన్న దుకాణాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. 
 
రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం చర్యల్లో భాగంగా, ఈ మద్యం దుకాణాల మూసివేతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే, గత ఎన్నికల ప్రచారంలో కూడా డీఎంకే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధ హామీని ఇచ్చింది. ఇందులోభాగంగా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్ల తర్వాత 500 మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31వ తేదీ నాటికి 5329 రిటైల్ మద్యం షాపులు ఉన్నాయి. ఇందులో 500 దుకాణాలను మూసివేస్తున్నట్టు ఏప్రిల్ 12వ తేదీన ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. ఏప్రిల్ 20వ తేదీన జీవో జారీ చేశారు. ఈ జీవో ఆధారంగా 500 టాస్మాక్ దుకాణాలను గుర్తించి జూన్ 22వ తేదీ నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments