Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి స్టేషన్‍‌లో విషాదం.. రైలు ఎక్కే క్రమంలో కాళ్లు పోగొట్టుకున్నయువకుడు

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (09:27 IST)
రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. రైలు ఎక్కే క్రమంలో ఒక యువకుడు తన రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. బాధితుడిని ఖమ్మ జిల్లా వాసిగా గుర్తించారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,  
 
ఖమ్మ జిల్లాకు చెందిన డి.నరేశ్ (26) అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఎంబీఏ చేయాలనే ఉద్దేశ్యంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో ఆయనకు విశాఖపట్టణంలోని ఓ కాలేజీలో సీటు వచ్చింది. ఆ కాలేజీలో చేరేందుకు విశాఖకు బయలుదేరారు. 
 
కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరారు. రిజర్వేషన్ లభించకపోవడంతో జనరల్ బోగీలోనే రాజమండ్రి వరకు వచ్చాడు. అక్కడ ఏసీ టిక్కెట్ తీసుకనేందుకు కిందకు దగినా ఆ అవకాశం లేదని తెలియడంతో మళ్లీ రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. అప్పటికే రైలు బయలుదేరింది. 
 
దీంతో యువకుడు తన లగేజీతో సహా కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో బోగీలు, పట్టాలు మధ్య పడిపోవడంతో కాళ్లు ఇరుక్కుని పోయాయి. ఈలోపు రైలు వేగం పుంజుకోవడంతో ఫ్లాట్‌ఫాం విడిచి వెళ్లింది. రైలు వెళ్లిపోయే సమయానికి నరేశ్ రెండు కాళ్లు తెగిపోయాయి. పట్టాలపై పడివున్న ఆ యువకుడిని రైల్వే సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments