ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతం సవాంగ్

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా పని చేసిన గౌతం సవాంగ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఏపీ సీఎంగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీజీపీగా గౌతం సవాంగ్‌‌ను నియమించారు. అప్పటి నుంచి ఆయన రాష్ట్ర డీజీపీగా వైకాపా నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన్ను బదిలీ చేసింది. 
 
అయితే, ఆయనను అవమానకరరీతిలో సాగనంపిందని తీవ్రస్థాయిలో విమర్శళు వెల్లువెత్తుతున్న విషయం తెల్సిందే. అయితే, గురువారం ఆయనకు ఏపీ ప్రభుత్వం పదవిని ఫిక్స్ చేసింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉదయం సంబంధించి ప్రతిపాదనలను గవర్నర్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపింది. 
 
అయితే, గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్ట్ నుంచి సవాంగ్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్న ఉదయభాస్కర్ పదవీకాలం ఆరు నెలల క్రితం ముగిసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ ఖాళీగానే వుంది. ఈ నేపథ్యంలో సవాంగ్‌ను ఛైర్మన్‌గా నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments