Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతం సవాంగ్

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా పని చేసిన గౌతం సవాంగ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఏపీ సీఎంగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీజీపీగా గౌతం సవాంగ్‌‌ను నియమించారు. అప్పటి నుంచి ఆయన రాష్ట్ర డీజీపీగా వైకాపా నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన్ను బదిలీ చేసింది. 
 
అయితే, ఆయనను అవమానకరరీతిలో సాగనంపిందని తీవ్రస్థాయిలో విమర్శళు వెల్లువెత్తుతున్న విషయం తెల్సిందే. అయితే, గురువారం ఆయనకు ఏపీ ప్రభుత్వం పదవిని ఫిక్స్ చేసింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉదయం సంబంధించి ప్రతిపాదనలను గవర్నర్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపింది. 
 
అయితే, గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్ట్ నుంచి సవాంగ్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్న ఉదయభాస్కర్ పదవీకాలం ఆరు నెలల క్రితం ముగిసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ ఖాళీగానే వుంది. ఈ నేపథ్యంలో సవాంగ్‌ను ఛైర్మన్‌గా నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments