Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (12:30 IST)
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వా శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో హిమంత్‌పై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఒకవేళ కేసు నమోదు చేయకుంటే పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలను ముట్టడించి ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 
 
దీంతో రేవంత్ రెడ్డిని ముందస్తుగా గురువారం అరెస్టు చేశారు. ఆయన్ను నివాసం ముందు పోలీసులు బారికేడ్లు పెట్టి భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద రేవంత్ రెడ్డి ధర్నా చేయనున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత అదుపులోకి తీసుకుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కావడంతో పాటు టీ పీసీసీ నిరసనలకు పిలుపునివ్వడంతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments