టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (12:30 IST)
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వా శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో హిమంత్‌పై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఒకవేళ కేసు నమోదు చేయకుంటే పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలను ముట్టడించి ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 
 
దీంతో రేవంత్ రెడ్డిని ముందస్తుగా గురువారం అరెస్టు చేశారు. ఆయన్ను నివాసం ముందు పోలీసులు బారికేడ్లు పెట్టి భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద రేవంత్ రెడ్డి ధర్నా చేయనున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత అదుపులోకి తీసుకుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కావడంతో పాటు టీ పీసీసీ నిరసనలకు పిలుపునివ్వడంతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raka: రాకా లుక్ కోసం రోజూ నాలుగు గంట‌ల స‌మ‌యాన్ని వెచ్చిస్తోన్న అల్లు అర్జున్‌

VarunTej: వాలీబాల్ శిక్షణలో మోకాలికి గాయమైన వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

Peddi: పెద్ది విడుదల జూన్‌కు వాయిదా పడిందని నిర్మాతలు ప్రకటించారు

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి --ఎం.వెంకయ్య నాయుడు

Nabha Natesh: బ్యూటిపుల్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి వస్తుంది, ఎందుకని?

సింహాలకు మనిషి వెన్ను చూపిస్తే వేటాడుతాయా? ఎదురుగా ముఖం చూపిస్తే పారిపోతాయా?, వీడియో

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తర్వాతి కథనం
Show comments