Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపులకు కేవలం అవి రెండే... బీసీలు ఆందోళన వద్దు... కేఈ

కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల బి.సిల ప్రయోజనాలు ఎక్కడా దెబ్బతినవు, కాపులను బి.సిల్లో కలపడాన్ని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. ప్రస్తుతం బి.సిలకు ఉన్న రిజర్వేషన్ శాతంలో ఏ మాత్రం మార్పు ఉండదు

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (21:21 IST)
కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల బి.సిల ప్రయోజనాలు ఎక్కడా దెబ్బతినవు, కాపులను బి.సిల్లో కలపడాన్ని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. ప్రస్తుతం బి.సిలకు ఉన్న రిజర్వేషన్ శాతంలో ఏ మాత్రం మార్పు ఉండదు. బి.సిల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా షెడ్యూల్-9 లో కాపులకు అదనంగా 5 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. 
 
కాపు రిజర్వేషన్ కేవలం విద్యా, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకే పరిమితమవుతుందన్నారు. ఏ సామాజికవర్గమైనా ఆర్థిక, విద్య, ఉద్యోగ అంశాలలో వెనుకబడి వుంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందన్నారు. బి.సిలకు నష్టం జరగనప్పుడు కాపు రిజర్వేషన్‌ను పెద్ద మనస్సుతో ఆహ్వానించాలన్నారు. 
 
కాపు రిజర్వేషన్‌ను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ప్రతిపక్ష పార్టీ కుట్ర పన్నిందని, అసెంబ్లీలో బిల్లు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రిగారు ప్రతిపక్షనాయకుడికి సరైన సమాధానం చెప్పారని తెలిపారు. అలాగే వాల్మీకి, బోయలను ఎస్టీలలో చేర్చడాన్ని స్వాగతిస్తున్నానని, వారి చిరకాల కోరిక నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ బి.సిల పార్టీ, వారి ప్రయోజనాలకు భంగం కలిగే ఏ పనీ చేయదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakshmi Manchu: కళను రాజకీయం చేయవద్దు... మంచు లక్ష్మీ కామెంట్స్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments