Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెట్లో సంచలనం: 17ఓవర్లలో 2 పరుగులు- తొలి బంతికే కేరళ గెలుపు

మహిళల అండర్-10 క్రికెట్ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. బీసీసీఐ ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా నాగాలాండ్ జట్టుపై మొదటి బంతికే కేరళ జట్టు విజయం సాధించింది. కేరళతో జరిగిన మ్యాచ్‌లో కేవలం ర

క్రికెట్లో సంచలనం: 17ఓవర్లలో 2 పరుగులు- తొలి బంతికే కేరళ గెలుపు
, శుక్రవారం, 24 నవంబరు 2017 (17:35 IST)
మహిళల అండర్-10 క్రికెట్ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. బీసీసీఐ ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా నాగాలాండ్ జట్టుపై మొదటి బంతికే కేరళ జట్టు విజయం సాధించింది. కేరళతో జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులకే నాగాలాండ్ కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో నాగాలాండ్‌ 17 ఓవర్లు ఆడి, కేవ‌లం 2 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ రెండు ప‌రుగుల్లో ఒక ప‌రుగుని ఓపెనర్ మేనక చేయ‌గా, మ‌రో ప‌రుగు వైడ్ రూపంలో ల‌భించింది.
 
కేర‌ళ బౌల‌ర్ల‌లో మిన్నూ మణి 4, సౌరభ్య 2, సంద్ర సురేన్, బిబీ సెబాస్టియన్ చెరో వికెట్ తీశారు. అనంత‌రం మూడు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన కేర‌ళ జట్టు ఒక్క బంతికే బౌండరీ సాధించి గెలుపును తన ఖాతాలో వేసుకుంది. కేరళ మహిళల ఆటతీరుపై క్రికెట్ స్టార్స్, ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టడానికి వీల్లేదు...