Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు అందర్నీ కలేసికొడతారు : కేఈ కృష్ణమూర్తి

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవతరించిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టి తిరిగి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఇంకేమైనా ఉందా అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి

Webdunia
ఆదివారం, 26 ఆగస్టు 2018 (17:08 IST)
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవతరించిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టి తిరిగి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఇంకేమైనా ఉందా అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఒక వేళ పొత్తంటూ పెట్టుకుంటే ప్రజలు తిరగబడి అందర్నీ కలేసికొడతారంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
 
ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పారు. టీడీపీ జాతీయ పార్టీ అని, ఇతర రాష్ట్రాల్లో పొత్తులు ఏవిధంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో మాత్రం పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. 
 
కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని తాను చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య స్పందించడపై కేసీఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ల ఎవరు తనకు చెప్పడానికి అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారన్నది తమ మనసులలో నాటుకుపోయిందని, కింది స్థాయి కేడర్ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments