Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిలా.. నిన్ను మిస్ అవుతున్నా.. జగన్ ట్వీట్

రాఖీ పండుగ సందర్భంగా ప్రజా సంకల్పయాత్రలో ఉండటంతో సోదరి షర్మిలను మిస్ అవుతున్నానని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెళ్లు అందరికీ జగన్ ట్వీట్టర్‌లో రాఖీ పం

Webdunia
ఆదివారం, 26 ఆగస్టు 2018 (16:37 IST)
రాఖీ పండుగ సందర్భంగా ప్రజా సంకల్పయాత్రలో ఉండటంతో సోదరి షర్మిలను మిస్ అవుతున్నానని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెళ్లు అందరికీ జగన్ ట్వీట్టర్‌లో రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. షర్మిలకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని వ్యాఖ్యానించారు.
 
'షర్మిల.. రాఖీ పండుగ సందర్భంగా నిన్ను మిస్ అవుతున్నా. అన్నగా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయ్. తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెళ్లందరికీ మీ జగనన్న రక్షా బంధన్ శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. 
 
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విశాఖలో ఉన్న జగన్ ఆదివారం ధారభోగాపురం వద్ద పార్టీ నేతలతో కలసి రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు మహిళా నేతలు జగన్ కు రాఖీలు కట్టారు. మిఠాయిలు తినిపించి ఆశీస్సులు పొందారు.
 
అలాగే, రక్షాబంధన్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేతికి ఆయన చెల్లెళ్లు రాఖీలు కట్టారు. ఈ విషయాన్ని చిరంజీవి కోడలు ఉపాసన ఓ ట్వీట్‌లో తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇద్దరు చెల్లెళ్లు చిరంజీవి చేతికి రాఖీలు కట్టి.. మిఠాయి తినిపించారు. అక్షింతలు వేసి దీవించిన చిరంజీవి, వారికి కానుకలను అందజేసి.. స్వీట్ తినిపించారు. అనంతరం, చిరంజీవి తన చెల్లెళ్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముచ్చటించారు అని పేర్కొన్నారు. 
 
అలాగే, రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోడీకి చిన్నారులు రాఖీలు కట్టారు. ఢిల్లీలోని 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న మోడీ నివాసానికి పలువురు చిన్నారులు వెళ్లారు. ఈ సందర్భంగా మోడీ చేతికి రాఖీలు కట్టారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన మోడీ.. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments