Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో కేసీఆర్ పర్యటన: మళ్లీ ఇద్దరు చంద్రులూ కలుస్తారా?

ఇద్దరు చంద్రులు మళ్లీ కలవనున్నారు. అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఇదే జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు, టి. సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఏర్పడుతుంది. అయితే, వీ

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (10:54 IST)
ఇద్దరు చంద్రులు మళ్లీ కలవనున్నారు. అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఇదే జరిగితే  ఏపీ సీఎం చంద్రబాబు, టి. సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఏర్పడుతుంది. అయితే, వీరిద్దరి మధ్యా ఎటువంటి అధికారిక చర్చలూ ఉండవని సమాచారం. అక్టోబర్ 1వ తేదీన దివంగత పరిటాల రవి, సునీతల కుమారుడు వివాహం వెంకటాపురంలో జరుగనుంది. 
 
ఈ  వివాహానికి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అనంత పర్యటన ఖరారైనట్టు సీఎం క్యాంపు కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి. ఆదివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి విమానంలో చేరుకునే కేసీఆర్, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురం వెళతారు. శ్రీరామ్ దంపతులను ఆశీర్వదిస్తారు. 
 
ఈ వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. దీంతో వెంకటాపురం ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.  వివాహం సమయంలో కేసీఆర్, చంద్రబాబు మరోసారి కలవనున్నారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments