Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి ప్రత్యేక హోదాపై తమాషా చేస్తున్నారా? అదో పొలిటికల్ స్టంట్ : కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారనీ, అందువల్ల అది ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు.

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారనీ, అందువల్ల అది ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీజేపీ పాలకులు ఏమాత్రం వెనక్కి తగ్గరాదనీ ఆయన కోరారు. అందేసమయంలో ప్రత్యేక హోదా హామీని నెరవేర్చనందుకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై కూడా కేసీఆర్ స్పందించారు. "పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టడమనేది ఓ చీప్‌ పొలిటికల్‌ స్టంట్‌. మొత్తం దేశ పరిస్థితిని అది మారుస్తుందా" అంటూ ప్రశ్నించారు. 
 
ఆయన శనివారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, ఏపీ ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. "నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టత ఇవ్వడంలేదు. ఇస్తామని చెబితే... ఇవ్వండి. లేదంటే... ఇవ్వం అని చెప్పేయండి. తమాషా కాకపోతే ఏమిటిదంతా? అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏం చెప్పినా కుండబద్దలు కొట్టినట్లు ప్రజలకు చెప్పాలన్నారు. ప్రతిరోజూ అక్కడ ప్రజలు, పార్టీలు ఆవేదన చెందడమేమిటి? ఇలా ఉండొచ్చునా? ఇంత గందరగోళం ఏ దేశంలో అయినా ఉంటుందా? అంటూ బీజేపీ పాలకులకు ఆయన ప్రశ్నలు సంధించారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments