నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

ఠాగూర్
బుధవారం, 15 మే 2024 (22:50 IST)
నెల్లూరు జిల్లా కావలి నియోజవర్గంలో ఆసక్తికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13వ తేదీన ఏపీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో కావలి నియోజవర్గ వైకాపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, ఆయన పొరపాటున టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థికి ఓటు వేశారు. ఈ విషయాన్ని ఆయన గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వైకాపా తరపున విజయసాయి రెడ్డి బరిలో ఉన్నారు. అయితే, పోలింగ్ రోజున వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప రెడ్డి పొరపాటున టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేశారు. పోలింగ్ సిబ్బందికి అభివాదం చేస్తూ పొరపాటుగా సైకిల్ గుర్తు బటన్‌ను నొక్కారు. ఆ వెంటనే తాను చేసిన పొరపాటును గ్రహించి పోలింగ్ సిబ్బందికి విషయం తెలుపడంతో, తామేం చేయలేమని సిబ్బంది చెప్పారు. ఇక చేసేదేం లేక ఆయన బయటకు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments