Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్కిరి బిక్కిరి అయిన కంగనా రనౌత్.. ఏమైందంటే?

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (19:44 IST)
ప్రముఖ సినీనటి కంగనా రనౌత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నూతన సంవత్సరం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి కంగనా రనౌత్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఆమెకి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

 
అయితే ఆలయం వెలుపలకు వచ్చే సమయంలో అభిమానుల తాకిడితో కంగనా రనౌత్ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరచాలనం చేసేందుకు క్యూలైన్లలో ఉన్న భక్తులు పోటీలు పడ్డారు. బలవంతంగా కంగనారనౌత్ చేతులను లాక్కుని మరి కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. హీరోయిన్‌తో పాటు ఉన్న కుటుంబ సభ్యులు భక్తులను ఎంత వారించినా వినిపించుకోలేదు.

 
ఒకానొక దశలో కంగనాకు తీవ్ర ఆగ్రహం కూడా వచ్చింది, అయితే శ్రీవారి ఆలయం కావడంతో భక్తులను ఏమీ అనలేక ఆమె మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. నూతన సంవత్సరం కావడంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లకు చెందిన సినీ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments