Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులు క్రమంగా మూడు రాష్ట్రాలకు దారితీయొచ్చు!

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (09:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానులు భవిష్యత్తులో క్రమంగా మూడు రాష్ట్రాలకు దారతీయొచ్చునని భువనేశ్వర పీఠాధిపతి (గన్నవరం) కమలానంద భారతి అభిప్రాయపడ్డారు. అందువల్ల మూడు రాజధానుల అంశాన్ని మొగ్గలోనే తుంచేయాలని ఆయన అన్నారు.
 
కాగా, ఇటీవల మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పైగా, త్వరలోనే మూడు రాజధానుల కోసం సమగ్రమైన మెరుగైన బిల్లును ప్రవేశపెడతామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 
 
దీనిపై గుంటూరులోని తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో కమలానంద భారతి మాట్లాడుతూ, మూడు రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెడుతామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇది కాలక్రమంలో మూడు రాష్ట్రాలకు దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఉన్నపుడు మూడు ప్రాంతాలను మూడు ముక్కలు చేయాలన్న భావన ప్రజల్లో కలుగుతుందన్నారు. 
 
ఒక రాష్ట్రం ఒక రాజధాని అనే ప్రాథమిక సూత్రం మేరకు ఒకే ప్రాంతంలోనే రాజధానివుంచి.. అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరించాలని కోరారు. పైగా, ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేసి, రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీతో శంకుస్థాపన చేయించారని ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments