Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్నారి వేర్లు అమ్ముకునే వృద్ధుడికి వివాహేతర సంబంధం.. ప్రాణం పోయింది..

నన్నారి వేర్లు అమ్ముకునే వృద్ధుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అతనితో సహజీవనం చేసే మహిళే ఆ వృద్ధుడి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీస

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (12:10 IST)
నన్నారి వేర్లు అమ్ముకునే వృద్ధుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అతనితో సహజీవనం చేసే మహిళే ఆ వృద్ధుడి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి మండలం ముసలివేడుకు చెందిన మునిలక్ష్మీ అలియాస్‌ ధనలక్ష్మీ, నారాయణవనం మండలం కన్యకాపురానికి చెందిన టి.బాలాజి అలియాస్‌ బాలకృష్ణ సహజీవనం సాగిస్తున్నారు. 
 
వీరు నన్నారి వేర్లు అమ్ముకుంటూ సంచార జీవనం చేసేవారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా తనకల్లు మండలం సున్నంపల్లి దగ్గర తాత్కాలికంగా కాపురం ఉంటున్నారు. మునిలక్ష్మీకి సున్నంపల్లికి చెందిన జెరిపిటి నారాయణప్ప (70)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
సహజీవనం చేస్తున్న బాలాజీకి ఈ విషయం తెలియరావడంతో నారాయణప్పను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. నెల రోజుల కిందట మునిలక్ష్మీతో కలిసి నారాయణప్పను హత్య చేశారు. అలంపూర్‌ అటవీ ప్రాంతంలో అస్తి పంజరం పడి ఉందని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కదిరి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ అస్థిపంజరం నారాయణప్పదని విచారణలో తేలింది. ఇతని హత్యకు ధనలక్ష్మి కారణమని వెల్లడి అయ్యింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments