Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనాడు విలేఖరిపై విచారణ జరిపించాలని క‌డియం గ్రామ‌స్తుల‌ ధర్నా

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:21 IST)
ఆధార్ కేంద్రంలో అవినీతికి పాల్పడుతున్న ఈనాడు విలేఖరి దుప్పలపూడి శ్రీనివాస్ పై విచారణ జరిపించాలని కడియం మండలానికి చెందిన పలు గ్రామాల భాదితులు సోమవారం ఆందోళన చేశారు. కడియంలో ర్యాలీగా బయలుదేరి తాహ‌సిల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని ఆధార్ కేంద్రానికి వచ్చిన నిరుపేదలను ఈనాడు విలేఖరి దోపిడీ చేస్తున్నాడని, దళిత గిరిజన పోరాట సమితి వ్యవస్థాపకుడు, న్యాయవాది చింతపర్తి రాంబాబు అన్నారు. అతనిపై చర్య తీసుకోవాల‌ని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

దుప్పలపూడి శ్రీనివాస్ పై రాజానగరం పోలీస్ స్టేషన్ లో చీటింగ్, మోసం(420,506) కేసు నమోదయింద‌ని, ఆ కేసుల్లో పోలీసులు అరెస్టు కూడాఆ చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆ కేసు కోర్ట్ లో పెండింగ్ లో ఉంద‌ని రాంబాబు వెల్లడించారు. యూనియన్ బ్యాంకు ఆధార్ కేంద్రంపై ఎసీబీ అధికారులతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతరం డిప్యూటీ తశీల్దార్ కె. శ్రీదేవి కి నిరసనకారులంతా వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో దుళ్ళ, వేమగిరి, వీరవరం, దామిరెడ్డిపల్లి, కడియం, కడియపులంక, జేగురుపాడు, కడియపుసావరం గ్రామాల నుండి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments