Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనాడు విలేఖరిపై విచారణ జరిపించాలని క‌డియం గ్రామ‌స్తుల‌ ధర్నా

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:21 IST)
ఆధార్ కేంద్రంలో అవినీతికి పాల్పడుతున్న ఈనాడు విలేఖరి దుప్పలపూడి శ్రీనివాస్ పై విచారణ జరిపించాలని కడియం మండలానికి చెందిన పలు గ్రామాల భాదితులు సోమవారం ఆందోళన చేశారు. కడియంలో ర్యాలీగా బయలుదేరి తాహ‌సిల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని ఆధార్ కేంద్రానికి వచ్చిన నిరుపేదలను ఈనాడు విలేఖరి దోపిడీ చేస్తున్నాడని, దళిత గిరిజన పోరాట సమితి వ్యవస్థాపకుడు, న్యాయవాది చింతపర్తి రాంబాబు అన్నారు. అతనిపై చర్య తీసుకోవాల‌ని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

దుప్పలపూడి శ్రీనివాస్ పై రాజానగరం పోలీస్ స్టేషన్ లో చీటింగ్, మోసం(420,506) కేసు నమోదయింద‌ని, ఆ కేసుల్లో పోలీసులు అరెస్టు కూడాఆ చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆ కేసు కోర్ట్ లో పెండింగ్ లో ఉంద‌ని రాంబాబు వెల్లడించారు. యూనియన్ బ్యాంకు ఆధార్ కేంద్రంపై ఎసీబీ అధికారులతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతరం డిప్యూటీ తశీల్దార్ కె. శ్రీదేవి కి నిరసనకారులంతా వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో దుళ్ళ, వేమగిరి, వీరవరం, దామిరెడ్డిపల్లి, కడియం, కడియపులంక, జేగురుపాడు, కడియపుసావరం గ్రామాల నుండి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments