Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై నేనే చూసుకుంటా... తాత సమాధి సాక్షిగా ఎన్టీఆర్ శపథం.. ఏంటది?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (10:23 IST)
హీరో జూనియర్ ఎన్టీఆర్ శపథం చేశారు. అదీ కూడా హైదరాబాద్‌లోని తన తాత స్వర్గీయ ఎన్.టి.రామారావు సమాధి సాక్షిగా ఆయన ఈ ప్రతిజ్ఞ చేశారు. అదేంటంటే.. ఇకపై ప్రతి యేడాది ఎన్టీఆర్ జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని చెప్పారు.
 
ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించేందుకు తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చారు. 
 
నిజానికి ఎన్టీఆర్ జయంతి లేదా వర్థంతి రోజుల్లో సమాధి మొత్తం వివిధ రకాల పూలతో ఎంతో అందంగా సుందరీకరిస్తారు. కానీ, మంగళవారం సమాధి వద్దకు హీరోలు వచ్చేసరికి సమాధిపై ఒక్కకంటే ఒక్క పువ్వు కూడా లేదు. దీన్ని చూసి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు తీవ్ర అసహనానికి గురయ్యారు. 
 
ఆ తర్వాత పూలను తానే తెప్పించి, తన ఫ్యాన్స్ సహాయంతో సమాధిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత పుష్పగుచ్చాలతో తారక్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు. తాత సమాధి పక్కనే కాసేపు మౌనంగా కూర్చున్నారు. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి జూనియర్ ఎన్టీయార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments