Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తా : వీవీ లక్ష్మీనారాయణ

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (16:55 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరు జిల్లాలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ -ఏపీటీఏ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ జరిగింది. ఇందులో ఆయన పాల్గొని పలువురు విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. 
 
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని తెలిపారు. అయితే, తాను స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తానా లేక కొత్త పార్టీ స్థాపిస్తానా? మరో రాజకీయ పార్టీలో చేరుతానా? అనే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని తెలిపారు. 
 
కాగా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే పేద విద్యార్థుల్లో అర్హులైన వారిని ఆదుకునేందుకు ఏపీటీఏ ఉపకార వేతనాలు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

తర్వాతి కథనం
Show comments