టీడీపి భేటీకి జేసి బ్రదర్స్ డుమ్మా: బాలయ్య సైతం.. చంద్రబాబు ఆరా.....

Webdunia
సోమవారం, 1 జులై 2019 (14:28 IST)
ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్ష జరిపేందుకు ఏర్పాటైన అనంతపురం జిల్లా నేతల సమావేశానికి జేసీ సోదరులు హాజరుకాలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆదివారం తొలిసారి టీడీపీ అనంతపురం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. 
 
జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి బికే పార్థసారథి, మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీలు గుండుమల తిప్పేస్వామి, శమంతకమణి, మేయర్ స్వరూప, మాజీ శాసనసభ్యులు పల్లె రఘునాథ రెడ్డి, జతేంద్ర గౌడ్, యామినీ బాల, కందికుంట వెంకటప్రసాద్, ఈరన్నలు హాజరయ్యారు. పరిటాల శ్రీరామ్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. 
 
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి కీలకమైన నేతలు కొందరు హాజరుకాలేదు. వారిలో మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వారి స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారి కుమారులు జేసీ పవన్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి సమావేశానికి డుమ్మా కొట్టారు. 
 
హిందూపురం మాజీ పార్లమెంటు సభ్యుడదు నిమ్మల కిష్టప్ప, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా సమావేశానికి రాలేదు. బాలకృష్ణ కూడా సమావేశానికి రాలేదు. చంద్రబాబుతో కలిసి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినందున ఆయన సమావేశానికి హాజరు కాలేకపోయారు. అయితే, కొంత మంది నేతలు ఎందుకు డుమ్మా కౌట్టారనే విషయంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. 
 
ధర్మవరం మాజీ శాసనసభ్యుడు గోనుగుంట్ల సూర్యనారాయణ బిజెపిలో చేరడంపై సమావేశంలో చర్చించారు. అక్కడ బలమైన నాయకుడిని ఇంచార్జీగా నియమించాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments