Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబు వల్లే ఆ ఇద్దరూ చనిపోయారు : పవన్ కళ్యాణ్

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చడానికి ప్రధాన కారణంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (10:07 IST)
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చడానికి ప్రధాన కారణంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ బాక్సైట్ తవ్వకాలను నిలిపివేసివుంటే ఆ ఇద్దరు నేతలు నక్సల్స్ తూటాలకు బలయ్యేవారు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
 
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోలు హత్య చేయడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. అరకు నియోజకవర్గంలోకి వచ్చే గూడ గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీ తవ్వకాలపై ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉండాల్సిందన్నారు. ప్రభుత్వం అలా స్పందించి ఉంటే నేడు ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని కోల్పోవాల్సి వచ్చుండేది కాదని అన్నారు. 
 
తన ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అరకులోని గూడ గ్రామాన్ని సందర్శించినట్టు చెప్పారు. ఆ సమయంలో అక్కడ క్వారీల తవ్వకాల వల్ల కలుషితమైన తాగునీటిని గ్రామస్తులే పవన్ కళ్యాణ్‌కు చూపించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పర్యావరణానికి హానిచేస్తున్న అక్రమ క్వారీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments