Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధర్మ మార్గంలో ధర్మాదాయ శాఖ : జనసేన నేత మహేష్

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (19:09 IST)
రాష్ట్రంలో ధర్మాదాయ శాఖ అధర్మ మార్గంలో ప్రయాణిస్తుంది జనసేన పార్టీ నేత మహేష్ ఆరోపించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, పారదర్శకంగా పాలన అందిస్తున్న దుర్గ గుడి ఈవోపై ప్రభుత్వం కక్ష కట్టటం దారుణమన్నారు. 
 
వచ్చే దసరాకి దోచుకోటానికే ఈవోపై బదిలీ వేటు వేశారని ఆరోపించారు. గత దసరాకి 6 నుండి 7 కోట్లు ఖర్చు అయితే ఈ దసరాకి 20 కోట్లు ఖర్చు చేసి దోచుకోవాలని మంత్రి వెల్లంపల్లి చూస్తున్నారని ఆరోపించారు. మంత్రికి అనుకూల వర్గాన్ని దుర్గగుడిలో పోస్టింగ్ వేసి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయాలని చూస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
సంవత్సరం తీరగకుండానే ఈవో కొటేశ్వరమ్మని బదిలీ చేయాటానికి కారణం మంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పారదర్శకంగా పాలన చేస్తుంటే బదిలీ అనే బహుమానం మంత్రి ఇచ్చారన్నారు. దాతలు సహకారంతో  దుర్గ గుడిలో నిర్మాణాలు జరుగుతుంటే దాతల దగ్గర కూడా కమిషన్‌లు అడగటం సిగ్గు చేటన్నారు. 
 
అసంపూర్తిగా ఉన్న రాతి మండపం నిర్మాణంకి రూ. 7 కోట్లు బిల్స్ రిలీజ్ చేయాలని మంత్రి ఒత్తిడి తెచ్చారన్నారు. మంత్రి చెప్పిన మాటలు ఈవో వినటం లేదని, అందుకే ఈఓపై బదిలీ వేశారన్నారు. మంత్రి వెల్లంపల్లి చెప్పిన వారికి కాంట్రాక్టు ఇవ్వకపోవడం వలనే ఈవోపై బదిలీ వేటు వేశారన్నారు. పారదర్శక పాలన అంటే ఇదేనా?? ముడుపులకు ఆశపడే మంత్రి ఈవోను మారుస్తున్నారు.. ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించాలి అని ఆయన డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments