Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు విజయవాడలో జనసేన పార్టీ జనవాణి

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (11:46 IST)
జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జనవాణి కార్యక్రమం జరుగనుంది. సామాన్యుడి ఘోషను వినేందుకు వీలుగా జనవాణి పేరుతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు. 
 
ఇదే విషయంపై ఆ పార్టీ పీఏసే ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, వైకాపా ప్రతినిధులు నిర్వహిస్తున్న గడప గడప కార్యక్రమం ఒట్టి బూటకమన్నారు. రాష్ట్రంలో ప్రజలు తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. అందుకే, తమ పార్టీ అధ్వర్యంలో ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 
 
తొలి జనవాణి కార్యక్రమాన్ని మూడో తేదీన విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ఆ తర్వాత వాటిని సంబంధిత విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు పంపించి, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జనసేన పార్టీ తరపున ఆరా తీస్తారని తెలిపారు. 
 
విజయవాడలో ఈ నెల 10న కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతామన్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఈ నెల 12 నంచి తమ కార్యకర్తలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments