Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు విజయవాడలో జనసేన పార్టీ జనవాణి

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (11:46 IST)
జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జనవాణి కార్యక్రమం జరుగనుంది. సామాన్యుడి ఘోషను వినేందుకు వీలుగా జనవాణి పేరుతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు. 
 
ఇదే విషయంపై ఆ పార్టీ పీఏసే ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, వైకాపా ప్రతినిధులు నిర్వహిస్తున్న గడప గడప కార్యక్రమం ఒట్టి బూటకమన్నారు. రాష్ట్రంలో ప్రజలు తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. అందుకే, తమ పార్టీ అధ్వర్యంలో ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 
 
తొలి జనవాణి కార్యక్రమాన్ని మూడో తేదీన విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ఆ తర్వాత వాటిని సంబంధిత విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు పంపించి, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జనసేన పార్టీ తరపున ఆరా తీస్తారని తెలిపారు. 
 
విజయవాడలో ఈ నెల 10న కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతామన్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఈ నెల 12 నంచి తమ కార్యకర్తలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments