Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలుపోటములతో నిమిత్తం లేదు.. ప్రజాసేవే ముఖ్యం : జనసైనికులు

Webdunia
శనివారం, 25 మే 2019 (11:11 IST)
ఇటీవల వెల్లడైన ఏపీ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. కానీ, తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి బరిలోకి దిగిన రాపాక వరప్రసాద్ మాత్రం గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ ఒక్క సీటుతో ఖాతా తెరిచింది. 
 
ఇదిలావుంటే, ఈ ఎన్నికల్లో ఓడిన తెదేపా నేతలు, శ్రేణులు పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయివుంటే.. వైకాపా కార్యకర్తలు, నేతలు మాత్రం విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ, జనసేన సైనికులు మాత్రం ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. తద్వారా తమకు గెలుపోటములతో సంబంధం లేదని నిరూపించారు. 
 
"జనసైనికులంటే గెలిస్తే సంబరాలు చేసుకుని ఓడిపోతే నిరుత్సాహపడే వాళ్ళు కాదని గెలిచినా ఓడినా ఎప్పుడూ ప్రజలలోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని ప్రజలకు తెలియచేస్తూ "మార్పు కోసం జనసేన" కార్యక్రమంలో భాగంగా శనివారం కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెం గ్రామంలో  అనేక మంది జనసైనికులు డ్రైనేజీ కాలువల పూడికతీత పనుల్లో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments